ప్రభుత్వాన్ని తలసాని బద్నాం చేస్తున్నారు

by  |
ప్రభుత్వాన్ని తలసాని బద్నాం చేస్తున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: లక్ష డబుల్ బెడ్‌ రూం ఇళ్లు చూపిస్తానన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 15వేల ఇళ్లు కూడా చూపలేక పోయారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తలసాని గొప్పలు మాట్లాడి ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ చార్జీలను ఇంకా తగ్గించాలని, ఎల్ఆర్ఎస్‌తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని కోరారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు అభ్యర్థులు లేకనే తమ నేతలను చేర్చుకున్నారన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎవరికి ఎలా షాకిస్తారో తెలియదన్నారు. టీఆర్ఎస్‌కు డబ్బు బలం ఉందని, ఓటుకు రూ.10వేలు అయినా ఇస్తారన్నారు. టీఆర్ఎస్ దగ్గర డబ్బు తీసుకొని కాంగ్రెస్‌కు ఓటేయాలన్నారు. తాము ఆరుగురం 110మందికి గట్టి జవాబిస్తున్నామన్నారు.


Next Story

Most Viewed