ఖజానా నింపుకునేందుకే ఈ-చలానాలు -జగ్గారెడ్డి

by  |
ఖజానా నింపుకునేందుకే ఈ-చలానాలు -జగ్గారెడ్డి
X

దిశ, వెబ్‎డెస్క్: ఖజానాను నింపుకునేందుకే ప్రభుత్వం ట్రాఫిక్ పోలీసులతో ఈ చలానాలు వేయిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. కరోనా సమయంలో ఇప్పటివరకు విధించిన చలానాలను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గన్‎పార్క్ వద్ద జగ్గారెడ్డి మాట్లాడుతూ.. క్వశ్చన్ అవర్‎లో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. ఇక జీరో అవర్‎లో కాంగ్రెస్ నుంచి ఒకరికే మాట్లాడే అవకాశం ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆటో రిక్షాలు, బైకులకు అధిక జరిమానాలను విధిస్తున్నారని విమర్శించారు. రైతుబంధు పేరుతో ఇచ్చిన డబ్బును ఆ రైతు కొడుకు నుంచి వసూలు చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు.

Read Also…

ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు :సీతక్క



Next Story