- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జీహెచ్ఎంసీలో ఎమర్జెన్సీ విధించాలి: షబ్బీర్
by Shyam |

X
దిశ, న్యూస్బ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీలో ఎమర్జెన్సీ విధించాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 15రోజుల్లో రాష్ట్రంలో, ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కొవిడ్-19 కేసుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని కార్యకలాపాలను నిలిపివేసి, కరోనా వ్యాప్తి చెందకుండా అరికట్టాలన్నారు. అత్యవసర సమాయాల్లో కొవిడ్-19 రోగులకు వైద్యాన్ని నిరాకరించవద్దని, అన్ని ప్రైవేట్ ఆస్పత్రులను ఆదేశించాలని ప్రభుత్వానికి సూచించారు.
Next Story