నెల తరువాత జైపూర్‌కు సచిన్

by  |
నెల తరువాత జైపూర్‌కు సచిన్
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ రెబల్ నేత సచిన్ పైలట్ ఢిల్లీ నుంచి జైపూర్‌కు చేరుకున్నారు. దాదాపు నెల రోజుల తరువాత ఆయన రాజస్థాన్‌కు తిరిగివచ్చారు. కాగా, ఇవాళ ప్రియాంక, రాహుల్ గాంధీతో భేటీతో సచిన్ పైలట్ మెత్తబడ్డాడు. దీంతో రాజస్థాన్ కాంగ్రెస్‌లో అసమ్మతి చల్లారినట్లయింది. సచిన్ పైలట్ జైపూర్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘నేను పార్టీ పెద్దలతో కీలక అంశాలను ప్రస్తావించాను. వ్యక్తిగతంగా నేనేమీ కోరలేదు.’’ అని అన్నారు. కాగా, ఈనెల 14 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.


Next Story