రాజస్థాన్‌లో మళ్లీ రాజీనామాల సంక్షోభం

by  |
రాజస్థాన్‌లో మళ్లీ రాజీనామాల సంక్షోభం
X

దిశ, వెబ్ డెస్క్: సచిన్ పైలట్ మెత్తపడటంతో రాజస్థాన్ సంక్షోభం కొలిక్కి వచ్చిందనుకునేలోపే కాంగ్రెస్‌కు మరో తలనొప్పి వచ్చిపడింది. తాజాగా ఆపార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. లేఖలను నేరుగా స్పీకర్‌కే పంపించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ హెన్రీ సింగ్ వెల్లడించారు.

ఓ లబోబి సింగ్ నాయకత్వంపై తమకు విశ్వాసం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యేలు ప్రకటించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ఆరుగురు ఎమ్మెల్యేలు స్పీకర్‌తో భేటీ అయ్యారు. అనంతరం రాజీనామా లేఖలను స్పీకర్‌కు అందించారు. అయితే ఇప్పటి‌వరకు రాజీనామాలకు స్పీకర్ ఆమోదించలేదని ఎమ్మెల్యే హెన్రీసింగ్ తెలిపారు.


Next Story

Most Viewed