ప్రాణం తీసిన కుక్క వివాదం

by  |
ప్రాణం తీసిన కుక్క వివాదం
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: పెంపుడు కుక్క వివాదం చివ‌రికి మ‌నిషి ప్రాణం తీసింది. ఈ సంఘ‌ట‌న మంగ‌ళ‌వారం భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ముల‌క‌ల‌ప‌ల్లి మండ‌లం తాళ్ల‌పాయి గ్రామంలో జ‌రిగింది. గ్రామానికి చెందిన జోగులు కొద్దిరోజులుగా ఓ కుక్క‌ను పెంచుకుంటున్నాడు.

మంగ‌ళ‌వారం ఇంటి ప‌రిస‌రాల్లో సంచ‌రిస్తూ పొరుగున ఉన్న వీర‌స్వామి అనే వ్య‌క్తి ఇంట్లోకి వెళ్లింది. దీంతో ఆగ్ర‌హం చెందిన వీర‌స్వామి కుక్క త‌మ ఇంటికి రాకుండా చూసుకోవాల‌ని జోగులును ఆగ్ర‌హంతో హెచ్చ‌రించాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మాటా మాట పెరిగి ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింది. ఈ ఘ‌ర్ష‌ణ‌లో జోగులు త‌ల‌పై వీర‌స్వామి క‌ర్ర‌తో దాడి చేయ‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు.


Next Story

Most Viewed