ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం : కల్నల్

by  |
ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం : కల్నల్
X

దిశ, వెబ్ డెస్క్: దేశ సరిహద్దు ప్రాంతం అయిన కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జవాన్లకు తమ మొబైల్ ఫోన్ల నుంచి ఈ యాప్స్‌ను వెంటనే తొలగించాలని ఆర్మీ ఆదేశించింది. గత మూడేళ్ళుగా పలు భారత సైనికాధికారులు, పాకిస్తాన్ ఇంటలిజెన్స్ వర్గాల హనీ ట్రాప్ వలలో చిక్కుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. దేశ భద్రతా కారణాల రీత్యా డేటా శత్రు దేశాలకు చేరకుండా. భారత ఆర్మీ జవాన్లు 89 రకాల మొబైల్ యాప్స్ వాడకుండా కేంద్రం నిషేధం విధించింది. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆర్మీ అధికారి హై కోర్టును ఆశ్రయించారు.

లెఫ్టినెంట్ కల్నల్ పి.కె. చౌదరి దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రభుత్వ నిర్ణయం ‘ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధమని’ పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో లెఫ్టినెంట్ కల్నల్ పి.కె. చౌదరి కొత్త పాలసీని ‘‘ఏకపక్ష చర్య’’ అని తన పిటిషన్‌లో ఉపసంహరించుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే చైనీస్ యాప్స్‌తో పాటు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి యాప్‌ల నుంచి వెంటనే జవాన్లు తమ ఖాతాలని తొలగించాలని ఇండియన్ ఆర్మీ జులై 8న ఆదేశాలు జారీ చేసింది. జులై 15 నాటికి జవాన్ లు అంతా తమ ఖాతాలను తొలగించాలని, ఈ ఆదేశాలు పాటించని సైనికులపై కఠిన చర్యలు తీసుకుంటామని తమ ప్రకటనలో హెచ్చరించింది. చైనా, పాకిస్తాన్ ఇంటలిజెన్స్ వర్గాల నుంచి ఇతర దేశాల శత్రు సమాచారం తస్కరించటానికి ప్రయత్నాలు గతంలో చాలా జరిగాయి. ఈ నేపథ్యంలో కీలక సమాచారాన్ని ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది.


Next Story