- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఆందోల్: జిల్లాలో కొనసాగుతున్న వైకుంఠధామాలు, డంప్ యార్డు నిర్మాణ పనులను ఆగస్టు 15 వరకు పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని వట్పల్లి మండలం కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆకస్మికంగా అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. నిర్జప్ల గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
అసంపూర్తిగా ఉన్న పనులనువేగవంతంగా పూర్తిచేయాలని, సర్పంచ్లు బాధ్యతతో యుద్ధ ప్రాతిపదికన ఆయా పనులను పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ నెల 15 వరకు వైకుంఠ ధామాలు, డంపుయార్డు నిర్మాణపు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రతిరోజు తమ మండలంలోని ఆయా గ్రామాల వైకుంఠధామాలు, డంపుయార్డు, రైతు వేదికల నిర్మాణాల పురోగతిని పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.