ఆ స్థాయిలో పురోగతి సాధించాలంటే..

by  |
ఆ స్థాయిలో పురోగతి సాధించాలంటే..
X

దిశ, గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గంలో రైతు వేదికల నిర్మాణాలు అనుకున్న స్థాయిలో పురోగతి సాధించాలంటే.. అధికారుల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, నియోజకవర్గ పరిధిలో నిర్మాణం పూర్తైన వైకుంఠధామాలు, డంప్ యార్డ్‌లు వినియోగంలోకి తేకుంటే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ వెంకట్రామ రెడ్డి హెచ్చరించారు.

బుధవారం ఉదయం గజ్వేల్ ఐఓసీలోని గడ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో అభివృద్ధి పనుల పురోగతిపై నియోజకవర్గ పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు వేదికల నిర్మాణం చేపట్టాలని, వానాకాలం పంట పూర్తయ్యేలోపు రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.



Next Story