నిర్మల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

by  |
నిర్మల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్:
రైతు వేదికల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. పెంబి మండలం తండా, ఇటిక్యాల గ్రామ రైతు వేదికల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే తో కలిసి ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనీ ఆయన అన్నారు. రైతు వేదికల నిర్మాణ పనులను అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి రోజూ పర్యవేక్షణ చేయాలనీ ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదన్నారు. కూలీల సంఖ్యను పెంచి సకాలంలో పనులు పూర్తి చేసేలా చర్యలను చేపట్టాలని సూచించారు.



Next Story