కేబుల్ ఆపరేటర్లతో రంగారెడ్డి కలెక్టర్ భేటి..

by  |
కేబుల్ ఆపరేటర్లతో రంగారెడ్డి కలెక్టర్ భేటి..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్లు, సర్వీస్ ప్రొవైడర్లతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ భేటి అయ్యారు. ఈ సమావేశానికి జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అమోయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ తరగతుల నేపథ్యంలో అన్ని కేబుల్స్‌లో టీశాట్, యాదగిరి చానల్స్ వచ్చేలా చూడాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఏ నెంబర్లలో చానల్స్‌ వస్తున్నాయో తప్పక స్క్రోలింగ్ పెట్టాలని.. అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పంచాయతీ కార్యదర్శులతో కో-ఆర్డినేట్ చేసుకోవాలని సూచించారు. కాగా, ఇప్పటికే ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్తున్న విషయం తెలిసిందే.


Next Story