నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్..!

by  |
నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్..!
X

దిశ, పటాన్‌చెరు:

నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తోందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్‌చెరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు గ్రామాలకు 18 మంది లబ్ధిదారులకు రూ. 6,32,500ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అమీన్‎పూర్ జడ్పీటీసీ గంగుల సుధాకర్ రెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బి.రాములు గౌడ్, కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందని అన్నారు. పటాన్‎చెరు నియోజకవర్గం ఒక మినీ ఇండియా అని.. ఎంతో మంది కార్మికులు, కర్షకులు పరిశ్రమలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారని అన్నారు.


Next Story