అసెంబ్లీ ముందుకు రెవెన్యూ బిల్లు..

by  |
అసెంబ్లీ ముందుకు రెవెన్యూ బిల్లు..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త రెవెన్యూ బిల్లును సీఎం కేసీఆర్ అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చారు. ఇవాళ, రేపు సభ్యులందరూ బిల్లు కాపీలను పూర్తిగా చదవాలని.. ఆ తర్వాత దానిపై చర్చ కొనసాగిద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మూడేళ్లలో కొన్ని మార్పులు చేసినా సరైన ఫలితాలు ఇవ్వలేదన్నారు.

ఇప్పుడు తెస్తున్న కొత్త చట్టంపై ప్రజలందరిలో ఉత్కంఠ నెలకొన్నదని వివరించారు. అంతేకాకుండా ధరణి పోర్టల్ కూడా వస్తుందన్నారు. ఇందులో వ్యయసాయ, వ్యవసాయేతర భూముల సమాచారం పక్కాగా ఉంటుందని సీఎం తెలిపారు.


Next Story