వైఎస్‌కు నివాళ్లర్పించిన సీఎం జగన్

by  |
వైఎస్‌కు నివాళ్లర్పించిన సీఎం జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం సీఎం ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, జగన్ మామ ఈసీ గంగిరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు వైఎస్సార్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు.

అనంతరం సీఎం కుటుంబసభ్యులతో ఘాట్ వద్ద ప్రార్థనలు చేశారు. కోవిడ్ నేపథ్యంలో వైఎస్సార్ ఘాట్ వద్ద స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ బాషా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు సి. శ్రీనివాస వేణు గోపాల కృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంఎల్సీలు వెన్నపూస గోపాల్ రెడ్డి, జకియా ఖానం, ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు.


Next Story

Most Viewed