ఏపీలో 20నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు !

by  |
ఏపీలో 20నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు !
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో 20నుంచి సిటీ బస్సులను నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మే 20న బస్సు సర్వీసులను ప్రారంభించగా అప్పటి నుంచి జిల్లాల్లో దాదాపు 3వేల బస్సులు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. అయితే విజయవాడ, విశాఖపట్నంలో ఇప్పటివరకు సిటీ బస్సులను ప్రారంభించలేదు. 20-26వరకు సచివాలయ ఉద్యోగాల కోసం రాతపరీక్షలు ఉండగా 10లక్షల మంది హాజరు కానున్నారు. దాంతో పరీక్ష రాసే అభ్యర్థులకోసం రవాణా ఏర్పాటు చేయాల్సి ఉంది. సచివాలయ ఉద్యోగాల పరీక్షల నేపథ్యంలో హెల్త్‌ ప్రొటోకాల్‌ ప్రకారం సిటీ బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అనుమతి కోసం ఫైల్‌ను పంపింది. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.


Next Story

Most Viewed