ఆ హీరో ఫోర్స్ చేయడం వల్లే నేను ఆ పార్ట్ చూపించాల్సి వచ్చింది.. అనసూయ షాకింగ్ కామెంట్స్

by Kavitha |
ఆ హీరో ఫోర్స్ చేయడం వల్లే నేను ఆ పార్ట్ చూపించాల్సి వచ్చింది.. అనసూయ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి నేడు సినిమాల్లో కీలక రోల్ చేసే స్థాయికి ఎదిగిన అనసూయ(Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా, రష్మిక మందన(Rashmika Mandannna) హీరోయిన్‌గా సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న పుష్ప(Pushpa) మూవీ సీక్వేల్‌గా వస్తున్న 'పుష్ప 2'(Pushpa 2) లో దాక్షాయణిగా అనసూయ నటిస్తోంది. పుష్ప మూవీతో ఈ భామకు ఎంతగా గుర్తింపు లభించిందో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. విలన్‌(సునీల్)కి భార్యగా ఆ పాత్రకే ప్రాణం పోసేసింది. ఇప్పుడు పుష్ప2లో కూడా స్ట్రాంగ్ క్యారెక్టరే ఉన్నట్టు ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆధారంగా తెలుస్తోంది. అలాగే రీసెంట్‌గా జగపతి బాబు(Jagapathi Babu) సరసన ‘సింబా’(Simba) అనే మూవీలో కూడా నటించి అలరించింది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ.. హీరో అడివి శేష్(Adivi Sesh) గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “క్షణం మూవీ(Kshanam Movie)లో హీరో అయినటువంటి అడివి శేష్ ఫోర్స్ చేయడంతో నా వెంట్రుకలను లైట్‌గా దువ్వుకొని జడ వేసుకున్నాను. దాంతో నా ఫోర్‌హెడ్ చూపించాల్సి వచ్చింది. అంతకు ముందు నన్ను అందరూ బట్ట తల దానా అనేవారు. ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత నా ఫోర్ హెడ్‌ను ధైర్యంగా చూపించగలుగుతున్నాను” అని అనసూయ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా అడివి శేష్ హీరోగా వచ్చిన క్షణం మూవీలో అనసూయ నెగెటీవ్ షేడ్‌లో ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed