- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా వివో వైదొలిగిన రోజునే మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. యూఏఈలో జరగనున్న ఐపీఎల్ సీజన్ 13ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న స్టార్ స్పోర్ట్స్కు చైనా కంపెనీలు రూ.700 కోట్ల విలువైన ప్రకటనలు ఇవ్వనున్నాయట. వీటిలో వివో వాటానే రూ.150 కోట్లు కావడం గమనార్హం. గత ఏడాది ఐపీఎల్ సమయంలో ప్రకటనల కోసం వివో రూ.150 కోట్లు ఖర్చు చేసింది. టైటిల్ స్పాన్సర్గా వైదొలగినా, ప్రకటనల బడ్జెట్ మాత్రం తగ్గించబోమని చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఇతర చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు ఐపీఎల్ సమయంలోనే ప్రకటనల కోసం భారీగా ఖర్చు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తున్నది.
Next Story