- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భారత్ పై చైనా ఆగ్రహం ఎందుకంటే…

దిశ వెబ్ డెస్క్: చైనాకు చెందిన 118 యాప్స్ లపై ఇండియా నిషేదం విధించడంపై డ్రాగన్ కంట్రీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిషేదం రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలను ఉల్లంఘించడమే అని తెలిపింది. భారత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి గో ఫెంగ్ అన్నారు. దేశ భద్రత, డేటా గోప్యత అంశాల్లో వ్యక్త మవుతున్న ఆందోళనల నేపథ్యంలో చైనాకు చెందిన 118 యాప్ లను భారత్ బుధవారం నిషేదించిన సంగతి తెలిసిందే..
కాగా నిషేదిత జాబితాలో బైడు, అలీపే, ఫేస్ యూ లాంటి యాప్ లు ఉన్నాయి. తాజా నిర్ణయంతో నిషేద యాప్ ల సంఖ్య 224కు చేరింది. గతంలో లడఖ్ లో భారత చైనా సైనికుల మధ్య ఘర్షణల నేపథ్యంలో పలు చైనా యాప్ లను భారత్ నిషేదించింది. తాజాగా భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మరో 118 యాప్ లను నిషేదిస్తు భారత్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.