పాక్‌తో కలిసి చైనా ఎత్తుగడ వేస్తోందా?

by  |
పాక్‌తో కలిసి చైనా ఎత్తుగడ వేస్తోందా?
X

న్యూఢిల్లీ: లడాఖ్‌లో ఉద్రిక్తతలు తగ్గడానికి భారత్, చైనాలు శాంతి చర్చలు జరపుతున్నప్పటికీ పాక్‌తో కలిసి ఇండియాపై విరుచుకుపడాలని డ్రాగన్ ఎత్తుగడ వేసిందనే చర్చ నడుస్తున్నది. ఒకవైపు పాక్ ట్రూపులు గిల్గిట్-బాల్టిస్తాన్ ఏరియాలకు తరలుతుంటే, జమ్ము కశ్మీర్‌లో విధ్వంసం సృష్టించడానికి ఉగ్రసంస్థ అల్ బదర్‌తో చైనా చర్చలు జరుపుతున్నట్టు కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

లడాఖ్ ఉత్తర రీజియన్‌లో దాదాపు 20వేల అదనపు సైన్యాన్ని పాకిస్తాన్ మోహరించిందని, అవకాశం దొరికితే భారత సైన్యంపై విరుచుకుపడాలని యోచిస్తున్నట్టు వివరించాయి. ఈ ప్రమాదంపై ఆర్మీ అధికారులు, ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చర్చలు జరుపుతున్నాయి. చైనా సూచనల మేరకు పాకిస్తాన్ ఐఎస్ఐ సరిహద్దులోకి అదనపు బార్డర్ యాక్షన్ టీంలు, కశ్మీర్‌లో భయాందోళనలు కలుగచేసేలా ఉగ్రదాడికి 100 టెర్రరిస్టులను కశ్మీర్‌లోకి పంపేందుకు సిద్ధమైనది తెలిసింది.


Next Story

Most Viewed