వాళ్లను వెంటనే ఖాళీ చేయించండి: జగన్

by  |
వాళ్లను వెంటనే ఖాళీ చేయించండి: జగన్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా.. కృష్ణా, గుంటూరు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించాలన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలని, సహాయ, పునరావాస కార్యక్రమాల్లో ఎక్కడా లోపాలు ఉండొద్దని అధికారులను ఆయన ఆదేశించారు. గోదావరి ముంపు బాధితులకూ అండగా ఉండాలని సూచించారు.


Next Story

Most Viewed