- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్పై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శలు చేశారు. కరోనా అనేది దేవుడి చర్య అంటూ నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై.. ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఆర్థిక మంత్రి ఏమైనా దైవదూతా అని ప్రశ్నించారు. కరోనా రాకముందు ఆర్థిక వ్యవస్థ నిర్వహణ లోపాలపై మంత్రి ఏం సమాధానం ఇస్తారనన్నారు. కరోనా అనేది దేవుడి చర్య అయితే 2017 నుంచి 2020 వరకు ఆర్థిక వ్యవస్థకు కారణమేంటని నిలదీశారు. జీఎస్టీ బకాయిలతో ఏర్పడిన రెవెన్యూ నష్టాలను రుణాల ద్వారా రాష్ట్రాలు పూడ్చుకోవాలని కేంద్రం చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రాల ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయంటూ మోడీ చెబుతుండటం ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని, ఆర్బీఐ విండో ద్వారా రుణాలు తీసుకోవడం అంటే, మార్కెట్ బారోయింగ్ కిందే లెక్క అని, ఇది కేవలం పేరు మార్పు మాత్రమేనని తెలిపారు.
Next Story