శ్రీశైలం బాధితులకు చంద్రబాబు ఫోన్ కాల్

by  |
శ్రీశైలం బాధితులకు చంద్రబాబు ఫోన్ కాల్
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సూర్యాపేట జిల్లాకు చెందిన దరావత్ సుందర్ నాయక్ ప్రాణాలు కోల్పోయాడు. అతని కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా వారి కుటుంబసభ్యులను తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోను ద్వారా పరామర్శించారు.

సుందర్ భార్యను కుటుంబ నేపధ్యం అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆమె నివాస స్థలం కేటాయించాలని, తన ఇద్దరు ఆడపిల్లల చదువుకి సహకరించాల్సిందిగా బాబుకి విజ్ఞప్తి చేశారు. ఆమె విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన చంద్రబాబు పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed