కొల్లు రవీంద్ర అరెస్ట్.. చంద్రబాబు ఆగ్రహం

by  |
Chandrababu
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వం మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి మండిపడ్డారు. రాజకీయ కక్షతోనే టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ ను ఆయన తీవ్రంగా ఖండించారు. కక్ష సాధింపుతోనే రవీంద్రను ఈ కేసులో ఇరికించారని, కనీసం ప్రాథమిక విచారణ కూడా జ‌ర‌ప‌కుండా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలోనూ ఇంతమందిపై త‌ప్పుడు కేసులు పెట్ట‌లేదని విమర్శించారు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్రలపై తప్పుడు కేసులు పెడుతూ బీసీలపై వైసీపీ ప్రభుత్వం పగపట్టిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


Next Story

Most Viewed