టీడీపీ జిల్లాల నూతన బాస్‌లు వీళ్లే

by  |
టీడీపీ జిల్లాల నూతన బాస్‌లు వీళ్లే
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆదివారం పార్టీ నూతన కమిటీని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమించారు. 13 జిల్లాలకు సమన్వయ కర్తలను నియమించారు. అంతేగాకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఇన్‌చార్జిని నియామకం చేశారు.

ఇందులో శ్రీకాకులం జిల్లాకు కూన రవికుమార్, విజయనగరానికి కిమిడి నాగార్జున, అరకు గుమ్మడి సంధ్యారాణి, విశాఖ పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి బుద్ధా నాగ జగదేశ్వరావు, కాకినాడ జ్యోతుల నవీన్, అమలాపురం రెడ్డి అనంతకుమారి, రాజమండ్రి కొత్తపల్లి జవహర్, నర్సాపూర్ తోట సీతారామ లక్ష్మీ, ఏలూరు గన్ని వీరాంజనేయులు, మచిలీపట్నం కొనకళ్ల నారాయణరావు, విజయవాడ నెట్టెం రాఘురాం, గుంటూరు తెనాలి శ్రవణ్ కుమార్, నర్సారావుపేట జీవీ ఆంజనేయులు, బాపట్ల ఏలూరి సాంబశివరావు, ఒంగోలు డాక్టర్ నూకసాని బాలాజీ, నెల్లూరు షేక్ అజీజ్, తిరుపతి జి. నరసింహయాదవ్, చిత్తూరు వెంకట మణిప్రసాద్, రాజంపేట ఆర్. శ్రీనివాసరెడ్డి, కడప మల్లెల లింగారెడ్డి, అనంతపురం కాల్వ శ్రీనివాసులు, హిందూపురం బీకే పార్థసారథి, కర్నూలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల గౌరు వెంటకరెడ్డిలను పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులుగా నియమించారు.


Next Story

Most Viewed