వాళ్ల దాడులకు వడ్డీతో సహా చెల్లిస్తాం….

by  |
వాళ్ల దాడులకు వడ్డీతో సహా చెల్లిస్తాం….
X

దిశ వెబ్ డెస్క్:
వైసీపీ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విధ్వంసం,వినాశనం, దాడులే ఆ పార్టీ లక్ష్యమన్నారు. ఏలూరు పార్లమెట్ టీడీపీ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…టీడీపీ నాయకుల, బీసీలు, ఎస్పీలపై వైసీపీ నాయకులు దాడులకు తెగపడుతున్నారని అన్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇన్ని అరాచకాలకు పాల్పడలేదని చెప్పారు. వైసీపీ దాడులకు వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు. వరద బాధితుల పునరావాస విషయంలోనూ వైసీపీ రాజకీయం చేయడం సిగ్గు చేటని అన్నారు. మంత్రులను వదర బాధితులే నిలదీయం వైసీపీ వైఫల్యాలకు నిదర్శనమని అన్నారు.


Next Story

Most Viewed