‘కక్షసాధింపు చర్యలు సరికాదు’

by  |
‘కక్షసాధింపు చర్యలు సరికాదు’
X

దిశ, అమరావతి: తప్పొప్పులు తెలుసుకోకుండా ఎదుటి వారిపై నిందలు వేయడం వైసీపీకి ఆనవాయితీగా వస్తున్న ఆచారమని టీడీపీ నేత చదలవాడ అరవింద్ బాబు విమర్శించారు. గుంటూరు జిల్లా నరసారావుపేట స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గానికి చెందిన అచ్చెన్నాయుడుపై అక్రమంగా అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మళ్ళీ అదే బీసీ వర్గానికి చెందిన కొల్లు రవీంద్రపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇది కేవలం కక్ష సాధింపు మాత్రమే అని అరవింద్ బాబు ఆక్షేపించారు. కృష్ణాజిల్లాలో వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య జరిగితే ఆ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా కొల్లు రవీంద్ర పై కేసు వేసి ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.


Next Story

Most Viewed