స్కాలర్​షిప్​లకు దరఖాస్తుల ఆహ్వానం

by  |
స్కాలర్​షిప్​లకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, న్యూస్​బ్యూరో: ఇంటర్మీడియట్​ –2020 మార్చి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఇంటర్​ విద్యార్థుల నుంచి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎంహెచ్​ఆర్​డీ) మెరిట్​ స్కాలర్​షిప్​లను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన విద్యార్థులు http://scholaships.gov.in వెబ్​సైట్​ ద్వారా రిజిస్ట్రేషన్​ చేసుకోవాల్సి ఉంటుంది. 2020–21 విద్యాసంవత్సరం కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకునే కొత్త, రెన్యూవల్​ విద్యార్థులు కూడా అక్టోబర్​ 31 లోపు తమ అభ్యర్థనలను సమర్పించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి 2,570 కొత్త స్కాలర్​షిప్​లను ఎంహెచ్​ఆర్డీ కేటాయించిందని, తాత్కలికంగా ఎంపిక చేసిన విద్యార్థుల జాబితాను అధికారిక వెబ్​సైట్​లో ఉంచుతున్నట్టు రాష్ట్ర ఇంటర్మీడియట్​ బోర్డు తెలిపింది.


Next Story

Most Viewed