నేడు సాయంత్రం హైదరాబాద్‌కు కేంద్ర బృందం

by  |

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో దాని నివారణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు కేంద్ర వైద్య బృందం నేడు సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఈ బృందంతోపాటు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కూడా రానున్నట్టు సమాచారం. నేడు తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులతో కేంద్ర బృందం భేటి అయి, రాష్ట్రంలో కరోనా కట్టడి, నివారణ చర్యలకు తీసుకుంటున్న జాగ్రత్తలపై వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఆదివారం నగరంలోని కంటైన్మెంట్ క్లస్టర్లు, ల్యాబ్ లు, ప్రైవేట్ ఆస్పత్రులను ఈ బృందం పరిశీలించనుంది.


Next Story

Most Viewed