3 క్యాపిటల్స్‎పై కేంద్రం క్లారిటీ..!

by  |
3 క్యాపిటల్స్‎పై కేంద్రం క్లారిటీ..!
X

దిశ, వెబ్‎డెస్క్: ఏపీ మూడు రాజధానుల విషయంలో తమ జోక్యం ఉండబోదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‎లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. విభజన చట్టం ప్రకారం ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని.. మూడు రాజధానులు తప్పులేదని స్పష్టం చేసింది. రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామని పేర్కొంది. మూడు రాజధానులపై కేంద్రం పాత్రపై పిటిషనర్ దోనే సాంబశివరావువి అపోహలేనని హోంశాఖ పేర్కొంది.

మూడు రాజధానుల విషయంలో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‎తో జగన్ సర్కారుకు కొంత ఉపశమనం లభించింది. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు.



Next Story