రూ.10 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు చోరీ

by  |
రూ.10 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు చోరీ
X

దిశ, వెబ్‌డెస్క్ : దుండగులు రోజుకో కొత్త తరహలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా చొత్తును దొచుకుంటున్నారు. తాజాగా చిత్తూరులో జిల్లాలో సినీ ఫక్కీలో రూ.10 కోట్ల విలువైన సెల్ ఫోన్లను తస్కరించి ఉడాయించారు. డ్రైవర్ పై దాడి చేసి లారీతో సహా పరారీ అయ్యారు.

చిత్తూరు జిల్లాలో సినీ ఫక్కీలో మొబైల్ ఫోన్ల లారీ చోరీకి గురైంది. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం ఎంఐ కంపెనీ నుంచి మొబైల్ ఫోన్లను తీసుకొస్తున్న లారీని ఏపీ సరిహద్దు వద్ద మరో లారీతో దుండగులు ఢీకొట్టారు. అనంతరం డ్రైవర్‌పై దాడి చేసి కాళ్లు చేతులు కట్టేసి సెల్ ఫోన్ల లారీతో పరారీ అయ్యారు. దుండగులు లారీలోని సెల్ ఫోన్లను మరో లారీలోకి డంప్ చేసుకోని ఆ లారీని నగరి శివారులో వదిలేశారు. లారీలో రూ.10 కోట్ల విలువైన సెల్ ఫోన్ల సరుకు ఉన్నట్లు లారీ డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.



Next Story