వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు

by  |
వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు
X

దిశ ఏపీ బ్యూరో: కడప జిల్లా పులివెందుల మాజీ ఎంపీ, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. తొలి రోజు ఈ కేసులో ఫైళ్లను సిట్ నుంచి స్వాధీనం చేసుకున్న సీబీఐ, సిట్ అధికారులు, డీఎస్పీల నుంచి కేసుపై పూర్తి వివరాలు సేకరించారు. తరువాతి రోజు వివేకా ఇంటి పరిసరాల్లోని వారిని విచారించారు. ఆ తరువాత వివేకా కుమార్తె నుంచి పలు విషయాలు తెలుసుకున్నారు. అనంతరం వాచ్ మెన్ రంగన్నను విచారించారు. వివేకా ఇల్లంతా తిరిగి పరిశీలించారు. తాజాగా టెక్నిలక్ టీమ్‌ను రంగంలోకి దించారు. వివేకాతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి కాల్ డేటా, ఎస్ఎమ్ఎంస్‌లను విశ్లేషించనున్నారు. దీంతో వివేకానందరెడ్డి హత్యపై క్లారిటీ వస్తుందని ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.


Next Story

Most Viewed