లైమ్ స్టోన్ గనుల తవ్వకాలపై సీబీఐ దర్యాప్తు 

by  |
 లైమ్ స్టోన్ గనుల తవ్వకాలపై సీబీఐ దర్యాప్తు 
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో లైమ్ స్టోన్ గనుల అక్రమ తవ్వకాలు జరిగాయన్న అభియోగంపై సీబీఐ కేసు నమోదు చేసుకుంది. పిడుగురాళ్ల మండలంలోని కోణంకి, దాచేపల్లి మండలంలో నడికుడి, కేశనపల్లి గ్రామాల్లో లైమ్ స్టోన్ గనుల తవ్వకాలపై సీబీఐ విచారణ చేపట్టనుంది. ఈ కేసులో మొత్తం 17 మందిని నిందితులుగా చేరుస్తు కేసు నమోదైంది.

ఐపీసీ 379, 386, 420, 447 సెక్షన్లు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంస నిరోధక చట్టంలోని సెక్షన్ 3లతో పాటు ఖనిజాలు, పేలుడు చట్టం సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 2010 జనవరి 1 నుంచి 2018 ఆగస్టు 9 మధ్య ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. గతంలోనూ ఈ వ్యవహారంలో పిడుగురాళ్ల, దాచేపల్లి పోలీసు స్టేషన్లలో నమోదైన మొత్తం కేసులను సీబీఐ తీసుకోనుంది .


Next Story