రియా చక్రవర్తి‌తో 9 గంటలు

by  |
రియా చక్రవర్తి‌తో 9 గంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సీబీఐ విచారణ ముమ్మరం చేస్తోంది. ఇదే కేసు వ్యవహారం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి స్నేహితురాలు అయిన రియా చక్రవర్తి‌ని సీబీఐ అధికారులు వరుసగా నాలుగో రోజు విచారించారు. ఏకంగా 9 గంటల పాటు సీబీఐ అధికారులు విచారణ జరిపారు.

ఆమె‌తో పాటు సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా అధికారులు విచారించారు. ఈ కేసు విచారణ కోసం సీబీఐ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడ్డారు. ఒక బృందం సుశాంత్ సన్నిహితులను విచారిస్తుండగా.. మరో బృందం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇదే వ్యవహారం లో పలు సంచలనలు వెలుగుచూస్తుండడంతో కేసు మరింత ఉత్కంఠ భరితంగా మారింది.


Next Story

Most Viewed