ఎంపీ అవినాశ్ రెడ్డి వైపు.. సీబీఐ చూపు!

by  |
ఎంపీ అవినాశ్ రెడ్డి వైపు.. సీబీఐ చూపు!
X

దిశ, ఏపీ బ్యూరో: కడప జిల్లా పులివెందులలో మాజీ ఎంపీ, దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వేగంగా జరుగుతోంది. 7 రోజుల విచారణలో వివేకా ఇంటి వాచ్మెన్ రంగాన్న, ఆయన కుమారుడు ప్రకాశ్… వివేకా పీఏ క్రిష్ణా రెడ్డిని సీబీఐ బృందం విచారించింది. అంతకుముందే సిట్, వివేకా కుమార్తె నుంచి పూర్తి వివరాలు, అనుమానాలు తెలుసుకుంది. పులివెందులలో నేడు కీలక వ్యక్తులను విచారించనుంది.

నేడో రేపో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు గత రెండు రోజులుగా వివేకా నివాస పరిసర ప్రాంతాలను సీబీఐ, సాంకేతిక నిపుణుల బృందాలు పరిశీలిస్తున్నాయి.25 మందికి పైగా సీబీఐ, సాంకేతిక బృందాలు ఈ కేసు ఛేదించేందుకు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed