సీఎం రిలీఫ్ ఫండ్ నకిలీ చెక్కులపై ఫిర్యాదు….

by  |
సీఎం రిలీఫ్ ఫండ్ నకిలీ చెక్కులపై ఫిర్యాదు….
X

దిశ,వెబ్ డెస్క్: ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.112కోట్లు కొట్టేసే కుట్ర జరిగింది. దీనిపై తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో అసిస్టెంట్ సెక్రటరీ మురళీకృష్ణారావు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మూడు నకలీ చెక్కుల వివరాలను పోలీసులకు మురళి కృష్ణారావు అందజేశారు. దీంతో ఈ ఫేక్ చెక్కులపై తుళ్లూరు సీఐ ధర్మేంద్రబాబు విచారణ చేపట్టారు.

కాగా నకిలీ చెక్కులతో సీఎం సహాయ నిధి నుంచి వందల కోట్లను కొల్లగొట్టడానికి కేటు గాళ్లు ప్రయత్నించారు. ఢిల్లీ, బెంగుళూరు, కోల్‌కత్తాలోని మూడు బ్యాంకుల ద్వారా చెక్కులను డ్రా చేసేందుకు ప్రయత్నించారు. కాగా చెక్కులపై అధికారులకు అనుమానం వచ్చి వెలగపూడి ఎస్‌ బీఐ బ్రాంచ్‌కు ఫోన్ చేయడంతో నకిలీ పర్వం బయట పడింది.


Next Story