బాల్య వివాహాలు.. రెండు కుటుంబాలపై కేసులు

by  |
బాల్య వివాహాలు.. రెండు కుటుంబాలపై కేసులు
X

దిశ, డోర్నకల్ : ఇద్దరు మైనర్లకు బాల్య వివాహాలు జరిపించిన ఇరు కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులపై కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పట్టణ శివారులోని చోక్ల తండాలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. చోక్ల తండాలో ఇద్దరు బాలికలకు శనివారం రాత్రి బాల్య వివాహం జరిగింది. ఈ విషయం పోలీసులకు చేరడంతో ఆ బాలికల తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు మరిపెడ ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు. అంతకుముందు మైనర్లకు పెళ్లి చేశారనే సమాచారం మేరకు మరిపెడ ఎస్ఐ చైల్డ్ లైన్ అధికారులు అరుణ, తహసీల్దారు రాఘవరెడ్డితో కలిసి చోక్లా తండాను సందర్శించారు. అక్కడ స్థానికులను విచారించి బాల్య వివాహాలు జరిగాయని నిర్ధారణ చేసుకున్నారు. అనంతరం ఎమ్మార్వో ఫిర్యాదు మేరకు బాల్య వివాహ నిరోధక చట్టం 2006ప్రకారం ఇద్దరు బాలికల తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.


Next Story

Most Viewed