ముగ్గురు ప్రభుత్వుద్యోగులు స్పాట్ డెడ్ 

by  |
ముగ్గురు ప్రభుత్వుద్యోగులు స్పాట్ డెడ్ 
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ప్రాణాలు కోల్పోయిన ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగులే. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

మృతి చెందిన వారిలో ఒకరు స్థానిక మున్సిపల్ ఆఫీసులో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న జీవన శేఖర్‌, ఒకరు ఆర్‌టీఓ ఆఫీస్‌లో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ శ్రీను, మరొకరు వెలుగు డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగిని సుభాషిణిగా పోలీసులు గుర్తించారు. వీరు విధులకు హాజరు కావడానికి భీమవరం నుంచి తణుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


Next Story