ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవాగులు

by  |
ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవాగులు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీల్లో కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రమాదవశాత్తు ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. కారులో మొత్తం నలుగు ప్రయాణిస్తుండగా, ఒకరు గల్లంతు అయ్యారు. ఈ ఘటన జీలుగుమిల్లి మండలం రామచంద్రాపురం గ్రామం వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గల్లంతు అయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా శుక్రవారం రాత్రి నుంచి రాష్ట్రంలో భారీ వర్షం కురుస్తున్న విషయం తెలిసిదే.


Next Story

Most Viewed