- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్ :
వైజాగ్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ అందరినీ కిందకు దించేశాడు. దీంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన ఏపీలోని విశాఖ జిల్లా ఊర్వశి కూడలి జాతీయ రహదారిపై శుక్రవారం వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే..ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఎన్ఏడీ కూడలి నుంచి తాటి చెట్లపాలెం జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న కారు ఇంజిన్ భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముందుగా దట్టమైన పొగలు రావడం గుర్తించి డ్రైవర్ అందరినీ అప్రమత్తం చేసి దించేశాడు. వెనుకే వస్తున్న వాహనదారులు ఫైర్ సేఫ్టీ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కారు బ్యాటరీలో షార్ట్ సర్క్యుూట్ వల్లే మంటలు వ్యాపించి ఉంటాయని అందరూ అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఆ సమయంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో కంచరపాలెం పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు.