కారు బీభత్సం

by  |
కారు బీభత్సం
X

దిశ వెబ్ డెస్క్: కూకట్ పల్లిలో కేపీహెచ్‌బీ జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. పోలీసులు వివరాల ప్రకారం…టీఎస్07జీఈ6999 నెంబర్ కారు కేపీహెచ్ మెట్రోస్టేషన్ నుంచి కూకట్ పల్లి మార్గంలో వెళుతోంది. పిల్లర్ నెంబర్ 757 వద్దకు చేరుకోగానే ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న అశోక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకా అక్కడితో ఆగకుండా మరో వ్యక్తిని, మరో రెండు ద్విచక్రవాహనాలను ఆ కారు ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Next Story

Most Viewed