కంటోన్మెంట్ ప్రాంతాల అభివృద్ధికి కృషి

by  |
కంటోన్మెంట్ ప్రాంతాల అభివృద్ధికి కృషి
X

దిశ, కంటోన్మెంట్: బోర్డు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ బోర్డ్ సీఈఓలు, బోర్డ్ సభ్యులు హరీశ్ రావును కలిశారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి రూ. 80 కోట్ల నిధులను విడుదల చేయాలని మంత్రి హరీశ్ రావును కోరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కంటోన్మెంట్ ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం కేసీఆర్ చొరవతోనే మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాల అభివృద్ధికి ప్రతి నెల రూ.10 కోట్ల నిధులను విడుదల చేస్తామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి, ఆర్థిక కార్యదర్శి రామకృష్ణారెడ్డి, కంటోన్మెంట్ బోర్డు సీఈఓలు చంద్రశేఖర్, అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed