అదానీ గ్రూప్ చేతికి మరో మూడు ఎయిర్‌పోర్టులు!

by  |
అదానీ గ్రూప్ చేతికి మరో మూడు ఎయిర్‌పోర్టులు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో జైపూర్, తిరవనంతపురం, గౌహతి ఎయిర్‌పోర్టులను లీజుకు ఇవ్వడానికి కేంద్రం అనుమతించింది. వీటి అభివృద్ధి కోసం అదానీ గ్రూపును ఎంపిక చేసింది. ఇప్పటికే మంగళూరు, అహ్మదాబాద్, లక్నో ఎయిర్‌పోర్టులను అదానీ గ్రూప్ నిర్వహిస్తోంది. తాజాగా మరో మూడు ఎయిర్‌పోర్టులను ప్రభుత్వం ఈ కంపెనీ చేతికి ఇచ్చింది.

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన విమానాశ్రయాలను అదానీ గ్రూపునకు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 1,070 కోట్ల ఆదాయం సమకూరుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ రాబోయే ఈ ఆదాయంతో విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఉపయోగించనుంది. అలాగే, ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను అందించనున్నట్టు తెలుస్తోంది.

ఈ విమానాశ్రయాలను 50 సంవత్సరాల పాటు నిర్వహించే హక్కు అదానీ గ్రూపునకు ఉండనుంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ నిర్వహించిన ఈ బిడ్డింగ్‌లో అదానీ గ్రూప్ విజయవంతంగా మూడు విమానాశ్రయాల నిర్వహణ, అభివృద్ధి కోసం లీజుకు ఇచ్చినట్టు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రభుత్వం రంగంలో పెట్టుబడులను ఉపయోగించి సేవలను, నైపుణ్యం, సామర్థ్యాలను పెంచుకోవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది.


Next Story

Most Viewed