TRAI: రెండు వారాల్లో 2.75 లక్షల నంబర్లు డిస్‌కనెక్ట్ చేసిన టెలికాం కంపెనీలు

by S Gopi |
TRAI: రెండు వారాల్లో 2.75 లక్షల నంబర్లు డిస్‌కనెక్ట్ చేసిన టెలికాం కంపెనీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇటీవల స్పామ్ కాల్స్, మెసేజ్‌ల నియంత్రణ కఠిన నిబంధనలు పాటించాలని నెట్‌వర్క్ కంపెనీలకు సూచించింది. ఈ క్రమంలో గడిచిన రెండు వారాల్లో నిబంధనలకు అనుగుణంగా ఉన్న 50కి పైగా కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచినట్టు టెలికాం సంస్థలు తెలిపాయి. అలాగే, 2.75 లక్షలకు పైగ మొబైల్ నంబర్లను డిస్‌కనెక్ట్ చేశాయి. ఈ చర్యల ద్వారా స్పామ్‌కాల్స్ తగ్గించవచ్చని, వినియోగదారులకు ఉపశమనాన్ని కలిగిస్తుందని ట్రాయ్ భావిస్తోంది. ఈ ఆదేశాలను అన్ని కంపెనీలు పాటించాలని, దేశంలో సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు సహకరించాలని ట్రాయ్ కోరింది. రిజిస్టర్ కాని టెలీమార్కెటర్ల నుంచి ప్రమోషనల్ కాల్స్ తక్షణం నిలిపేయాలని మరోసారి ట్రాయ్ స్పష్టం చేసింది. గత నెల 13న టెలికాం కంప్నీఎలకు ఆదేశాలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed