- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Jio: టెలికాం ఏఐ ప్లాట్ఫామ్ కోసం ఏఎండీ, సిస్కో, నోకియాతో జియో ఒప్పందం

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ టెలికాం దిగ్గజం జియో ప్లాట్ఫామ్ ప్రముఖ టెక్ కంపెనీలతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. టెక్ తయారీ కంపెనీలైన ఏఎండీ, నోకియా, సిస్కోలతో కలిసి జియో ప్లాట్ఫామ్ కొత్త ఏఐ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయనుంది. టెక్నాలజీ ఖర్చులను తగ్గించడంతోపాటు నెట్వర్క్ సెక్యూరిటీ, సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు టెలికాం ఏఐ ప్లాట్ఫామ్ను రూపొందించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. నెట్వర్క్ కార్యకలాపాల్లోని అన్ని స్థాయిలలో, విభాగాల్లో ఏఐ, ఆటోమేషన్ సహకారం అందిస్తుందని కంపెనీలు తమ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ మేరకు బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కార్యక్రమంలో ఒప్పందం చేసుకున్నాయి. ఏఐ ప్లాట్ఫామ్ ద్వారా యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపడుతుందని, డిజిటల్ ఎకోసిస్తమ్లో ఇతర అవకాశాలు అందుకునేందుకు వీలవుతుందని జియో ప్లాట్ఫామ్ సీఈఓ మాథ్యూ ఊమన్ చెప్పారు. కొత్త ఏఐ ప్లాట్ఫామ్ లార్గ్ లాంగ్వేజ్ మోడల్(ఏఐ సెర్చ్ ఇంజిన్) ద్వారా నెట్వర్క్ సామర్థ్యాలను ఆప్టిమైజ్ చేసేందుకు ఓపెన్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ను ఉపయోగించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.