- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
FDIs: దేశంలో 26 శాతం పెరిగిన ప్రత్యక్ష పెట్టుబడులు
by S Gopi |

X
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య దేశంలోకి ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) 25.7 శాతం పెరిగాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గణాంకాలు వెళ్లాడించాయి. దీంతో ఎఫ్డీఐలు 42.1 బిలియన్ డాలర్ల(రూ. 3.55 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. గతేడాది ఇదే సమయంలో రూ. 2.82 లక్షల కోట్ల ఎఫ్డీఐలు దేశంలోకి వచ్చాయి. ఈ పెట్టుబడులు ప్రధానంగా తయారీ, ఆర్థిక సేవలు, విద్యుత్, ఇతర ఇంధన, విద్యుత్ రంగాల్లో చేరాయి. అలాగే, మూడు వంతుల పెట్టుబడులు సింగపూర్, మారిషస్, నెదర్లాండ్స్, యూఏఈ, యూఎస్ల నుంచే వచ్చాయని గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా భారత్లో అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) కారణంగా అంతర్జాతీయంగా ఉన్న పెట్టుబడిదారులు ఎక్కువ ఆకర్షితులవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
Next Story