బీఎస్‌ఎన్‌ఎల్ మాజీ ఉద్యోగి అనుమానాస్పద మృతి

by  |
బీఎస్‌ఎన్‌ఎల్ మాజీ ఉద్యోగి అనుమానాస్పద మృతి
X

దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్ మాజీ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్‌పేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లగొండ పట్టణానికి చెందిన చొల్లేటి షణ్ముఖచారి(57) బీఎస్‌ఎన్‌ఎల్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆదివారం సాయంత్రం 5.30 నిమిషాలకు ఇంట్లో నుంచి బయల్దేరినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 6.20 నిమిషాల సమయంలో ఆయన పంతంగి టోల్‌గేట్ సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం 6.50 నిమిషాలకు పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఆందోల్ మైసమ్మ గుడి సమీపంలోని గణేష్ మిలినియం వెంచరుకు వెళ్లగా కొందరు వాహనదారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఒక కారు అలాగే ఉండటంతో పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా కారు డిక్కీలో శవం కనిపించింది. దీంతో పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహం సగం కాలి ఉండటంతో హత్య లేక ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు షణ్ముఖచారిగా గుర్తించారు.



Next Story

Most Viewed