- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం తుఫ్రాన్ పేట్ గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాలను బలిగొంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడికి దిగడంతో ముద్దంగుల వెంకటేష్(46) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.
గత సర్పంచ్ ఎన్నికల్లో సహకరించలేదనే నెపంతో వెంకటేశ్ ను చంపారని బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. గాయపరిచిన ఇద్దరు వ్యక్తులు వెంకటేష్(మరో వ్యక్తి), యాదగిరిలకు చెందిన నాలుగు ఇళ్లపై మృతుని బంధువుల దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి కారు, ఇల్లు బైక్ తగులబెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వెంకటేష్ మృతదేహాన్ని స్థానిక చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.