భూమి వివాదం.. అన్నను చంపిన తమ్ముడు

by  |
భూమి వివాదం.. అన్నను చంపిన తమ్ముడు
X

దిశ, నిజామాబాద్: అన్నదమ్ముల మధ్య ఉన్న భూమి పంపకం విషయంలో జరిగిన గొడవలో తమ్ముడు అన్నను కొడవలితో దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం తిప్పాపూర్‌లో బుధవారం రాత్రి జరిగింది. వివరాళ్లోకి వెళితే… భిక్నూర్​ మండలం తిప్పాపూర్​ గ్రామానికి చెందిన రాజయ్య, శంకర్​లు అన్నదమ్ములు. ఇద్దరికీ వారసత్వంగా వచ్చిన భూమి విషయంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా బుధవారం రాత్రి ఇద్దరు అన్నదమ్ములు అర్ధరాత్రి వరకూ మద్యం సేవిస్తూ.. భూమి గురించి చర్చించుకున్నారు. ఆ సమయంలో రాజయ్యకు కొడుకులు లేని కారణంగా రాజయ్య భూమి కూడా తనకే చెందుతుందని తమ్ముడు శంకర్​ వాదించాడు. అందుకు ఒప్పుకోని రాజయ్య శంకర్​తో వాగ్వాదానికి దిగాడు. దీంతో మద్యం మత్తులో ఆగ్రహానికి గురైన శంకర్, రాజయ్య మీద అదే రాత్రి కొడవలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ రాజయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. శంకర్​ అక్కడి నుంచి పారిపోయి పోలీసులకు లొంగిపోయాడు. తాను తన అన్నను చంపినట్టు తెలుపడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed