ఆమే లేదు..నేనెందుకు

by  |
ఆమే లేదు..నేనెందుకు
X

దిశ, పటాన్ చెరు: మనసారా ప్రేమించిన అమ్మాయి తన ప్రేమను తిరస్కరించడంతో ఓ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇద్దరి మనస్సులు కలిస్తే మనువాడ వచ్చని అతను కన్న కలలు కలలుగానే మిగిలిపోయాయి. రాష్ట్రాలు దాటి వచ్చినా ఆమె జ్ఞాపకాల తడి ఆరకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే..

ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన శ్యామ్ దాస్ (20) గత కొంతకాలంగా తన ఇద్దరు స్నేహితులతో కలిసి పాశమైలారంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో హెల్పర్ గా పనిచేస్తూ ఇస్నాపూర్‌లో నివాసం ఉంటున్నాడు.తన ఇద్దరు స్నేహితులు డ్యూటీకి వెళ్లిన సమయంలో తాడుతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే, తన మిత్రుడు గత కొంతకాలంగా స్వగ్రామానికి చెందిన యువతితో తరుచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడిని స్నేహితులు తెలిపారు.ఈ నేపథ్యంలోనే ప్రేమించిన యువతి తిరస్కరించడంతో మనస్తాపానికి గురైన శ్యామ్ దాస్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని వారు వెల్లడించారు. మృతుడి స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పటాన్ చెరు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed