ఆడుకుంటూ గేటును తగలడంతో..

by  |
ఆడుకుంటూ గేటును తగలడంతో..
X

దిశ, కోదాడ: మండల పరిధిలోని ఎర్రవరం గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి బాలుడు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యానాల శివయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు యానాల వేణు (12) ఇంటి పక్కనే ఉన్న పశువుల పాక వద్ద ఆడుకుంటూ గేటును తగలడంతో విద్యుత్ షాక్ గురై విగతజీవిగా పడిపోయాడు. గమనించిన స్థానికులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తండ్రి శివయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.


Next Story

Most Viewed